Sunday, October 30, 2011

కోమటీరెడ్డీ నేనున్నాను!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తెలంగాణకు బ్లాక్ డే అని, ఆరోజు నుంచి తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టనున్న మాజీ మంత్రి కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ప్రకటనకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. మంత్రి పదవిని త్యాగం చేసి రాష్ట్ర ఏర్పాటు కోసం దీక్ష చేస్తున్న కోమట్‌రెడ్డికి తెలంగాణవాదులు, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి విజయవంతం చేయాల్సిందిగా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌తో పాటు జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల నేతలు, విద్యార్థి, వైద్య, ఉపాధ్యాయ, ఆర్టీసీ, లెక్చరర్లు, న్యాయవాదుల జేఏసీలు, తెలంగాణలోని అన్ని సంఘాలు కోమట్‌రెడ్డి దీక్షకు మద్దతు పలికాయి. మొత్తానికి కోమటిరెడ్డి కాంగ్రెస్ వీడే రోజులు దగ్గర పడుతున్నట్టున్నాయి.

No comments:

Post a Comment

Thank you for your comment