Monday, October 31, 2011

నిప్పులో నవ్వుల చక్రవర్తి

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘నిప్పు’ సంచలనాలకు రెడీ అవుతోంది. దీక్షాసేథ్‌ హీరోయిన్. గుణశేఖర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను  వై.వి.ఎస్‌.చౌదరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో డారాజేంద్రప్రసాద్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.  ఈ చిత్రంలో డారాజేంద్రప్రసాద్‌ ఓ కీలకపాత్రను పోషిస్తున్నారని ఈ సందర్భంగా  వై.వి.ఎస్‌.చౌదరి ప్రకటించారు.  అది ‘ఆ నలుగురు’ పాత్రలా హుందాగా ఉంటుంది. ఆ పాత్ర సినిమాకే హైలైట్‌. కామెడీకే హీరోయిజాన్ని తెచ్చిన నటకిరీటి నటించిన సినిమాల డీవీడీలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ప్రత్యేకించి తమ ఇళ్లలో దాచుకుంటారు. అంతటి గొప్ప నటుడు తనకు మాత్రమే నప్పే పాత్రలతో హుందాగా కెరీర్‌ని సాగిస్తున్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment