Tuesday, November 1, 2011

‘బాబు వలలో కేసీఆర్’

తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వలలో చిక్కుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రెహ్మాన్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు వేసిన పథకంలో కేసీఆర్ చిక్కుకుపోయారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పక్కన బెట్టి కేసీఆర్-చంద్రబాబులు ఎవరి వద్ద ఎంత ఆస్తి ఉందనే అంశంపై చర్చించుకుంటున్నారని విమర్శించారు. ఆస్తుల గొడవలు పక్కనబెట్టి సకల జనుల సమ్మెలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు చేసిన త్యాగాలపై చర్చిస్తే బాగుంటుందని రెహ్మాన్ సూచించారు.

No comments:

Post a Comment

Thank you for your comment