Thursday, November 17, 2011

కాంగ్రెస్ ఖేల్ ఖతం : హరీష్‌రావు

కాంగ్రెస్ పార్టీ గత 50 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నామని, తెలంగాణ పేరు మీద కాంగ్రెస్ రాజకీయ చేస్తుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని అన్నారు.
మెదక్ జిల్లా పాదయాత్రలో బుధవారం హరీష్‌రావు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులున్నా ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదని హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణకు కట్టుబడి ఉంటామని మాటల్లో చెప్పడం కాదని, తెలంగాణ ప్రజలకోసం ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడే వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటదని హరీష్‌రావు స్ఫష్టం చేశారు.

No comments:

Post a Comment

Thank you for your comment