Monday, October 31, 2011

కాంగ్రెస్ కు బై.. తెరాసకు జై!

అనుకున్నదే అయింది. ఊహాగానాల్ని నిజం చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ టి.రాజయ్య, సోమారపు సత్యనారాయణ ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ కోసమే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టినట్టు ముగ్గురు ఎమ్మెల్యేలు తెలిపారు. వీరిని బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, డీఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మధ్యాహ్నం వీరు విలేకరులతో మాట్లాడారు. తమ రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా పీసీసీ అధ్యక్షుడికి పంపించినట్లు తెలిపారు. బరువైన గుండెతో కాంగ్రెస్‌ను వీడుతున్నామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తుందని ఇంతకాలం ఎదురుచూశామన్నారు. తెలంగాణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరగలేని పరిస్థితి ఉందన్నారు. సోనియా, కాంగ్రెస్ పార్టీ పట్ల తమకు అమితమైన ప్రేమ ఉందని అన్నారు. తెలంగాణ కోసం వ్యక్తిగత ఇష్టాలను పక్కనపెట్టామన్నారు. తెలంగాణ మంత్రులు ఇకనైనా కళ్లుతెరవాలన్నారు. తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోవద్దని కోరారు.  వీరు ముగ్గురూ తెరాసలో చేరనున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment

Thank you for your comment