Monday, October 31, 2011

ఎమ్మెల్యే హఠాన్మరణం

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి (55) ఆదివారం హఠాత్తుగా మృతిచెందారు. ఉదయం 5.30 గంటలకు గుండెపోటు రావడంతో ఆయన నిద్రలోనే కన్నుమూశారురు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన రాజేశ్వరరెడ్డికి తర్వాతి ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం రాజేశ్వరరెడ్డి కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన స్వస్థలం చిన్నచింతకుంట మండలం ఫరీద్‌పూర్. రాజేశ్వరరెడ్డికి భార్య, కుమార్తె ఉన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment