
కాగా పక్షం రోజుల క్రితం జనార్దన్గౌడ్ తెలంగాణకు తాను అనుకూలంగా
ఉన్నానని మొదట చెప్పిన చంద్రబాబు కేంద్రం తెలంగాణ ఇచ్చేందుకు ప్రక్రియను
ప్రారంభించామని చెప్పిన తర్వాత మాట మార్చి నాలుగున్నర కోట్ల తెలంగాణ
ప్రజలను చీటింగ్ చేశారని ఆరోపిస్తూ జనార్దన్గౌడ్ ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కోర్టు చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు
చేయాలని చైతన్యపురి పోలీసులను అప్పుడే ఆదేశించింది. అయినప్పటికీ పోలీసులు
స్పందించలేదు. దీంతో జనార్దన్గౌడ్ మరోసారి కోర్టు దృష్టికి విషయాన్ని
తీసుకు రావడంతో పోలీసులు కేసును నమోదు చేశారు.
No comments:
Post a Comment
Thank you for your comment