Wednesday, November 9, 2011

రచ్చబండ అక్కర్లేదు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని కాకుండా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మెదక్
జిల్లాలోని కరువు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కరువు వల్ల నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.10వేల పెట్టుబడి రాయితీ ప్రకటించాలన్నారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయకపోతే తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. చేగుంట మండలం నడిమితండాలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాము కుటుంబాన్ని వెంకయ్యనాయుడు పరామర్శించారు.

No comments:

Post a Comment

Thank you for your comment