Saturday, November 5, 2011

కొన్నిగంటల్లో దేవినేని ఉమ అరెస్టు

రచ్చబండలో చేసిన రచ్చపై కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. రెడ్డిగూడెంలో నిన్న జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి పార్థసారధిని అడ్డుకున్న కేసులో ఉమతో పాటు మరో పదిమంది కార్యకర్తలపై పోలీసులు 341,352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  దేవినేని ఉమను అరెస్ట్ చేసేందుకు పోలీసులు శనివారం ఉదయం గొల్లపూడిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున...
Read More >>

బ్లాక్ మనీ వీఐపీలు వీరే

ఎమ్మార్ లో కేవలం ఇరవై శాతం ధర అధికారికంగా చూపించి  మిగతా ఎనభై శాతం బ్లాక్ మనీతో అక్కడ విల్లాలు కొన్న ప్రముఖులకు చమటలు పడుతున్నాయి. మామూలుగా అయితే వీరికి ఈ కేసుల నుంచి పైరవీలు చేసి బయటపడటం పెద్ద కష్టమేం కాదు. కానీ కేసు సీబీఐ చేతుల్లో ఉండటమే వారి భయానికి కారణం. ఎక్కువ మొత్తంలో ఖర్చుచేసి తక్కువకే కొనుగోలు చేసినట్టు చూపించన నేపథ్యంలో కనిపించని డబ్బు చాలా మంది తమ బ్లాక్ మనీ నుంచే తెచ్చినట్లు సీబీఐతో పాటు ఆదాయపు పన్ను...
Read More >>

పేలిన “బిజినెస్ మాన్” డైలాగులు

మహేష్ బాబు తో పూరీ జగన్నాథ్ ‘ది బిజినెస్ మేన్’ పేరిట ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దూకుడుతో హిట్ కొట్టిన మహేష్ బిజినెస్ మాన్ గా మంచి బిజినెస్ చేయాలని తహతహలాడుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొన్నిడైలాగులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వాటిలో కొన్ని. డైలాగులను మహేష్ తన మాడ్యులేషన్ తో అదరగొట్టాడని చెబుతున్నారు. దీని...
Read More >>

డీఎస్పీ నళిని ఉద్యోగం పోయింది

తెలంగాణ కోసం రాజీనామా చేసిన డీఎస్పీ నళినిని డీజీపీ దినేష్‌రెడ్డి సస్పెండ్ చేశారు. విధుల విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి  క్రమశిక్షణ తప్పినందుకే సస్పెండ్ చేశామని ఆయన పేర్కొన్నారు. గతంలో తెలంగాణ కోసం ఆమె తన పదవికి రెండు సార్లు రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా సీమాంధ్ర అధికారుల వేధింపులు తాళలేకనే రాజీనామా చేశానని...
Read More >>

జగనే ఓ అపద్ధం: బాబు

సీబీఐ విచారణ అనంతరం చంద్రబాబును విచారించాలి అన్న జగన్ పై కర్నూలు పాదయాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఘాటుగా స్పందించారు.  వైయస్ జగన్ అబద్ధాలకోరు అని, సిబిఐకి తనపై తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి తాను అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కానిస్టేబుల్ కొడుకు అయిన గాలి జనార్దన్ రెడ్డి, జగను అంత నిజాయితీ పరులైతే రాజ...
Read More >>

పెట్రోలు ధరలు మీ ఇష్టమా: హైకోర్టు

కేవలం ఏడాదిలో నలభై శాతం పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వానికి ఇన్నాళ్లకు దీనిపై పెద్ద ఆటంకం ఎదురయింది. పెట్రోల్ ధరల పెంపును కేరళ హై కోర్టు తప్పు పట్టింది.  మీ ఇష్టాను సారం పెట్రోలు ధరలు పెంచుతూ పోతే కామన్ మాన్ ఏమయిపోవాలని ఆగ్రహం వ్యక్తంచేసింది. మాజీ ఎంపీ థామస్ వేసిన పిటిషనుపై కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ సీఎన్ రామచంద్రన్ నాయర్ విచారణ జరిపారు. తరచూ పెట్రోలు ధరలు పెంచడాన్ని తప్పు పడుతూ  ఐవోసీ,...
Read More >>

శబరిమలకు ఆర్టీసీ బస్సులు

ఆర్టీసీ హరిహరపుత్రుడు అయ్యప్ప సేవలో తరిస్తోంది. కేరళలోని శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అంతేకాదు చార్జీల్లో రాయితీ కూడా ఇచ్చింది. ఏడాదికేడాది ఆంధ్రప్రదేశ్ నుంచి తరలివెళ్లే భక్తజనులు పెరగడంతో వారికి సదుపాయాలు కల్పించడానికి ఆర్టీసీ కృషిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భక్తుల...
Read More >>

జగన్ జర్నలిజం పాఠాలు

జగన్ కు ఎవరు నేర్పారో గాని, ఎప్పుడు తనమీద ఆరోపణలు వచ్చినా… ఒక్కసారి కూడా ఖండించరు. వెంటనే తన ప్రత్యర్తులు చేసిన అవినీతిని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. “నేనే కాదు, వాళ్లు కూడా చేశారు, కావాలంటే ఇదిగో ఆధారాలు” అన్నట్టే ఉంటుంది ఆయన వాలకం. రాజకీయంలో ఈ పద్ధతికి వైఎస్ పునాదులు వేస్తే, జగన్ పెంచి పోషించారు. తాజాగా తన వాలకాన్ని...
Read More >>

మొగుడు సినిమా రివ్యూ

కృష్ణవంశీ ఏం చేస్తాడు.. కొత్తగా ఆలోచిస్తాడు. తాను నమ్మింది తీస్తాడు. కాంప్రమైజ్ కాడు. లవ్-కిడ్నాప్ నేపథ్యంలో ఒక గులాబి, కుటుంబ బంధాల కలబోతతో ఒక నిన్నే పెళ్లాడతా, తీవ్రవాదం బ్యాక్ డ్రాప్ లో ఒక సింధూరం.. ఇలా ఆరంభంలో అతని సినిమాలు వేటికవే డిఫరెంట్. కానీ ఈ క్రియేటివ్ డైరెక్టర్ సృజనాత్మకత మురారి దగ్గరే ఆగిపోయింది. ఆ సినిమాలో తెలుగు...
Read More >>

Friday, November 4, 2011

వెనుక గేటు నుంచి జగన్

ఓబులాపురం మైనింగ్ కేసులో విచారణ కోసం సీబీఐ నుంచి నోటీసులందుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిబిఐ కార్యాలయానికి వెనుక గేటు నుండి లోనికి వెళ్లారు. శుక్రవారం సిబిఐ ముందు హాజరు కావడానికి ఆయన తన ఇంటి వద్ద నుండి ఉదయం పది గంటల ప్రాంతంలో బయలు దేరారు. సుమారు పదిన్నర గంటలకు సిబిఐ కార్యాలయానికి చేరుకున్న ఆయన వెనుక గేటు నుండి లోపలకు...
Read More >>

జగన్ అభిమానులపై లాఠీ ఛార్జి

ఓబుళాపురం మైనింగ్ కేసులో విచారణ కోసం జగన్మోహనరెడ్డి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగన్‌ను విచారిస్తున్నారని తెలుసుకొని భారీగా పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. సిబిఐ కార్యాలయం ముందు వీరు పెద్ద ఎత్తున గుమికూడి రభస చేయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. దీంతో అభిమానులు సిబిఐ కార్యాలయ బోర్డును తొలగించారు. పలుసార్లు వారు లోనికి చొచ్చుకెళ్లే...
Read More >>

రామలింగరాజుకు బెయిల్

జైలు నుంచి బయటకు రావాలన్న రామలింగరాజు ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, ఆడిటర్ వడ్లమాని శ్రీనివాస్ లకు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరికీ రెండు లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో...
Read More >>

పాపం చిరు అభిమానులు

చిరంజీవి అభిమానులకు శుక్రవారం తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలికేందుకు చిరంజీవి వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు విమానాశ్రయంలోకి అనుమతించలేదు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను ఎంతకూ లోపలకు అనుమతించక పోవడంతో వారు విమానాశ్రయం ముందు ఆందోళనకు ద...
Read More >>

అన్నా మౌనదీక్ష విరమణ

అన్నా హజారే మౌన 19 రోజుల మౌనదీక్షను విరమించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఆయన దీక్ష విరమణ జరిగింది. అక్టోబర్ 16 నుంచి పందొమ్మిది రోజులు పాటు అన్నా హజారే మౌనదీక్ష చేపట్టారు. భారత్ మాతాకీ జై అంటూ మౌనం వీడారు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనలోక్ పాల్ బిల్లు అమలయ్యేవరకూ పోరాడతానని స్పష్టం చేశారు. తన మౌనదీక్ష...
Read More >>

‘నువ్విలా’ రివ్యూ

  రవిబాబు, ఉషా కిరణ్ మూవీస్, శేఖర్ చంద్ర.. మళ్లీ ‘నచ్చావులే’ టీమ్ తెరపైకి వచ్చింది ‘నువ్విలా..’ అంటూ.  ఆకట్టుకునే పోస్టర్లు, కొత్త తరహా పబ్లిసిటీ, ఫీల్ గుడ్ మ్యూజిక్ తో మళ్లీ నచ్చావులే మ్యాజిక్ ను రిపీట్ చేసేలా కనిపించిన ‘నువ్విలా..’ ఆశించిన స్థాయిలో లేదు కానీ నిరాశ పరిచేది మాత్రం కాదు. పిజ్జా కార్నర్లో పనిచేసే ముగ్గురు...
Read More >>

షార్లెట్‌లో దసరా, దీపావళి వేడుకలు

దసరా, దీపావళి వేడుకలను అమెరికాలోని షార్లెట్‌లో తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షార్లెట్(టీఏజీసీఏ) ఆధ్వర్యంలో అక్టోబర్ 29 న జరిగిన ఈ సంబరాల్లో సుమారు 800 కి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 130 మంది బాల, యువ కళాకారులు పలు ప్రదర్శనలలో పాల్గొన్నారు.  TAGCA  సహాయ...
Read More >>

సీన్ రివర్స్ !

గులాబీ జట్టులోకి మరో ఐదుగురు?   నవంబరు 5 ముహూర్తం ! గులాబి జట్టులోకి మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వెళ్లనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచే టిఆర్ఎస్‌లోకి చేరనున్నారు. రెండు రోజుల్లో వీరు టిఆర్ఎస్‌లో అధికారికంగా చేరుతున్నట్లు సమాచారం. మామ ప్లాన్ వేస్తే, అల్లుడు అమలు చేస్తారు… మామ స్కెచ్ గీస్తే అల్లుడు  రూపం...
Read More >>

ఎమ్మార్ తొలి బలిపశువు కోనేరు ప్రసాద్

ఎమ్మార్‌ అవకతవకల కేసులో కోనేరు ప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. రేపు ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెడతారు. విలాసవంతమైన విల్లాల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆదారాలు స్పష్టంగా దొరకడంతో సీబీఐ కీలక చర్యలకు ఉపక్రమించింది. హైకోర్టు ఆదేశాలమేరకు ఆగస్టు 17న ఎమ్మార్‌ వ్యవహారంపై సీబీఐ కేసునమోదుచేసింది. తప్పుడు లెక్కలతో...
Read More >>

మాట నిలబెట్టుకున్న కేజ్రీవాల్

సామాజిక ఉద్యమకారుడు కేజ్రీవాల్ మాట తప్పలేదు. పదవీ విరమణకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.9 లక్షలనూ అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం చెల్లించారు. నిరసన వ్యక్తం చేసేందుకే తాను ఆ డబ్బును చెల్లిస్తున్నానని, ఇందులో తన తప్పు ఉన్నట్లుగా భావించరాదని ఆయన స్పష్టం చేశారు. రూ.9, 27, 787 విలువతో కూడిన చెక్‌ను ఓ లేఖకు జతచేసి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు పంపారు. వడ్డీలేకుండా తనకు రుణమిచ్చిన మెగసేసే అవార్డు గ్రహీత హరీష్‌...
Read More >>

‘ఈనాడు’కు శంకర్రావు జై

విచిత్రమైన ఆరోపణలు, సరికొత్త వ్యాఖ్యానాలతో నిత్యం వార్తల్లో ఉండే శంకర్రావు గురువారం మళ్లీ మీడియాను ఆకట్టుకున్నారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవటంలో ఈనాడు సంస్థను ఆదర్శంగా తీసుకుని ఇతర సంస్థలు ముందుకు రావాలని ఆయన అందరికీ సూచించారు. కర్నూలులో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....
Read More >>

సిగ్గు లేని ప్రభుత్వం

ఇది భారతదేశం కాదు. ధరల భారతం. దేశంలో అతి వేగంగా పెరుగుతున్నది జనాభా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ.. దానికంటే వేగంగా పెరుగుతున్నవి సామాన్యుడు వాడే వస్తువులు. సగటున ఇండియాలో ప్రతి వారం ఏదో ఒక వస్తువు ధర పెరుగుతూ పోతోంది. గత మూడేళ్లలో ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది. నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచే ప్రభుత్వాలను ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తాజాగా ద్రవ్యోల్బణం 12.21 శాతానికి చేరుకుంది....
Read More >>

మంత్రుల జీతాలు పెరగనున్నాయ్

త్వరలో రాష్ట్రమంత్రుల వేతనాలను పెంచాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులతో పాటు ఇతర రాష్ట్రల మంత్రుల వేతనాలను పరిశీలించి ఆ తరువాత ఒక అభిప్రాయానికి వస్తామని ఆయన తెలిపారు.  ఆ తర్వాత అధికారులతో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆరునెలల క్రితమే రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాలను పెంచిన విషయం తెలిసిందే కద...
Read More >>

బ్రహ్మి వైఎస్ జగన్ అయితే!

బ్రహ్మి వెండితెరపై నవ్వుల కులదైవం. ఆయన తెరపై కనిపిస్తే పండుగ. హీరో లేకుండా, హీరోయిన్ లేకుండా సినిమా ఆడుతుందేమో కానీ బ్రహ్మి లేకుండా సినిమా ఆడని పరిస్థితి ఇప్పుడు తెలుగు సినిమాది. అసమానమైన ఆయన నటనకు, హావభావాలకు మురిసిపోని వారు, నవ్వుకోని వారు చాలా చాలా అరుదు. ఏ సినిమా హిట్టో, ఏ సినిమా ఫట్టో తెలియని విచిత్ర పరిస్థితికి చేరిన తెలుగు సినీ...
Read More >>

నాది 3 బెడ్రూమే, జగన్ ది 60 బెడ్ రూమ్

గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పడుతుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం నుంచి రైతు పోరు బాట మొదలుపెట్టిన బాబు గురువారం కడపలో పర్యటించారు. శుక్రవారం ఆయన పర్యటన కర్నూలు జిల్లాలో జరగనుంది. కడప పాదయాత్రలో ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తనది త్రిబుల్ బెడ్ రూమ్ అయితే,  జగన్ మోహన్ రెడ్డికి 60 గదుల బెడ్రూమ్ ఉందన్నారు....
Read More >>

మన మానవుల అభివృద్ధి స్థానం 134

ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం  రూపొందించిన మానవాభివృద్ధి సూచి(హెచ్‌డీఐ)లో భారత్‌ స్థాయి దిగజారిపోయింది.  బుధవారం విడుదలైన  ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక-2011లో ప్రపంచవ్యాప్తంగా 187 దేశాలలో ఇండియా 134వ స్థానంలో నిలిచింది. దేశంలో మనిషి సగటు జీవనకాలం గత 20 ఏళ్లలో గణనీయం గా పెరిగి 65.4 ఏళ్లకు చేరుకున్నప్పటికీ ఇంత తక్కువ ర్యాంకు రావడమే విచిత్రం. ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితం, జ్ఞానసముపార్జనకున్న అవకాశాలు,...
Read More >>

అసాంజే కేసు మేనేజ్ చేశారు

  ulian Assange at London Hi-court  అసాంజే కేసును అనుకున్నట్టుగానే అమెరికా మేనేజ్ చేయగలిగింది. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు లండన్ హైకోర్టులో బెయిలు దక్కలేదు. గతంలో ఈ వెబ్‌సైట్ కోసం కార్యకర్తలుగా పనిచేసిన ఇద్దరు మహిళల ఫి ర్యాదు మేరకు స్వీడన్‌లో ఆయనపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. దీంతో...
Read More >>

పొన్నాలకు అమెరికా అవార్డు

మన ఐటీ మంత్రికి అమెరికా పురస్కారం లభించింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ప్రతిష్టాత్మక ఓక్లహామా స్టేట్ యూనివర్శిటీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం లభించింది. లక్ష్మయ్య ఆ యూనివర్శిటీ  స్టూడెంటే. ఆ యూనివర్శిటీ సత్కరించిన జాబితాలో ఈయన తొంభైవారు కావడం విశేషం. లక్ష్మయ్య ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఆ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్...
Read More >>

హంటా వైరస్ కలకలం

...
Read More >>

ప్రభుత్వ మెజార్టీపై హైకోర్టులో వాదనలు

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలచారి వేసిన పిటిషన్ పై హైకోర్టులో బుధవారం వాదనలు ప్రారంభం అయ్యాయి. మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయిన నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవిని నిర్వహించే చట్టబద్ద అధికారం లేదని పేర్కొంటూ వేణుగోపాలాచారి నిన్న కో వారెంటో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి...
Read More >>

వాళ్లది తొందరపాటు : డీఎస్

అతి త్వరలో తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం తొందరపాటు చర్యేనని, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని, అధిష్టానం రాష్ట్రంలోని పరిస్థితుల్ని చక్కదిద్దాలని సీరియస్ గా ఆలోచిస్తోందని త్వరలోనే అనిశ్చితి తొలగిపోతుందని...
Read More >>

నటుడికంటే సినిమా గొప్పది

ఆర్టిస్టుల కంటే సినిమా గొప్పదని నటుడు, దర్శకుడు రవిబాబు అన్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రచారంలో తాను సృజనాత్మకంగా వ్యవహరిస్తానని తెలిపారు. ఈరోజు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నువ్విలా సినిమా యువతను తప్పక ఆకట్టుకుంటందన్నారు. సందేశాలు ఏవీ లేకుండానే రెండు గంటల సేపు హాయిగా నవ్వుకునే విధంగా చిత్రం ఉంటుందన్నారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై...
Read More >>

తెలంగాణ కోసం మరో దీక్ష

తెలంగాణకోసం నిజమాబాద్‌కు చెందిన మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి ఒకరోజు దీక్ష చేపట్టారు. ఆర్మూర్‌లోని జంబి హనుమాన్ దగ్గర దీక్ష ప్రారంభమైయింది. ఈ దీక్షకు పలువురు కాంగ్రేస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, జేఏసీ,ఉద్యోగ సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొని సంఘీబావం తెలిపారు. మరోవైపు మాజీ మంత్రి కోమట్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు...
Read More >>

గన్‌మెన్‌లను తీసుకోండి : ఇంటలిజెన్స్

గన్‌మెన్‌ల ఉపసంహరణ అంశాన్ని పునరాలోచించుకోవలిసిందిగా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు లేఖ రాశారు. మావోయిస్టు కార్యకలాపాలు తీవ్రమవుతున్న తరుణంలో గన్‌మెన్‌లను వెంట ఉంచుకోవల్సిందిగా అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధులకు విడివిడిగా లేఖలు రాసింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు నిఘా వర్గాలు లేఖ రాశాయి. గన్‌మెన్‌లు లేకుండా తిరగొద్దని ఆయనకు సూచించారు. వెనక్కి పంపించిన...
Read More >>

18 వ రాష్ట్రానికి అభ్యంతరం ఎందుకు : కేకే

1956 తర్వాత 17 రాష్ట్రాలు ఇచ్చారని, అప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదని, 18వ రాష్ట్రం అయిన తెలంగాణ విషయంలో జాప్యం  ఎందుకు జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ కేకే ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడే వరకూ తాను ఏపదవిలో ఉండనని కేకే అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్...
Read More >>

బాబు వేశాలు జనం నమ్మరు : బొత్స

అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం పాదయాత్ర చేయటం హాస్యాస్పదంగా ఉందని, ఆయన ఎన్ని వేషాలు వేసినా ప్రజలు విశ్వసించరని  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబునాయుడు తన స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర చేపట్టారని,  వైఎస్ రాజశేఖరరెడ్డిలా పాదయాత్ర చేసి బాబు...
Read More >>

గవర్నర్ కాంగ్రెస్ ఏజెంట్‌

గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్‌లా పనిచేస్తున్నారని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ తగ్గలేదు, బల నిరూపణ అవసరం లేదు అని ఢిల్లీలో గవర్నర్ మాట్లాడి, ఆ పదవి విలువను దిగజార్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ...
Read More >>

Thursday, November 3, 2011

ఉద్యోగులకు జీతాలివ్వకుండా మోసం చేసిన సిఈవో

హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా నష్ట పోయేది మాత్రం సమాన్య మద్య తరగతి కుటుంబ ఉద్యోగులు మాత్రమే. హైదరాబాద్‌లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మోసం చేసిన ఓ యానిమేషన్ కంపెనీ భాగోతం ఆలస్యంగా వెలుగులొకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే బంజారా హిల్స్‌లో ఉన్న ఓ యానిమేషన్ కంపెనీ నిర్వాహాకులు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మోసం చేయడంతో...
Read More >>

ఫిక్సింగ్ చేయకుంటే చంపేస్తాం, బెదిరింపులు: మోడి

'లలిత్ మోడి' ఇండియన్ క్రికెట్ చరిత్రలో 'ఐపిఎల్'కి సువర్ణ అద్యయనం పలికిన వ్యక్తి. అదే ఐపిఎల్ ద్వారా ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి. ప్రస్తుతం క్రికెట్లో ఎక్కువ మంది చర్చించుకుంటున్న భూతం ఫిక్సింగ్. అందుకు కారణం ఇటీవలే లండన్ కొర్టు పాకిస్దానీ ఆటగాళ్లు ఫిక్సింగ్ ఆరోపణలు పాల్పడ్డారంటూ వారిపై తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో...
Read More >>

'ఐ1 సూపర్ సిరీస్' రేసింగ్‌లో సచిన్ పెట్టుబడి సమాచారం..!

ముంబై: నిన్న వన్ ఇండియా తెలుగు న్యూస్‌లో సచిన్ టెండూల్కర్ ఓనర్‌గా త్వరలో 'ఐ1 సూపర్ సిరిస్' అనే 'ఇండియన్ రేసింగ్ లీగ్' అనే ఆర్టికల్‌ని పాఠకులకు తెలియజేయడం జరిగింది. మచ్‌దర్ మోటార్ స్పోర్ట్స్ చెందిన ఈ లీగ్‌లో క్రికెట్ దేవడు సచిన్ టెండూల్కర్, సంజన రెడ్డి ఇద్దరూ కలపి అందులో 26శాతం వాటాని కొనుగొలు చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది....
Read More >>

సచిన్ ఇండియన్ లీగ్ రేసులో బడా బాబులు

ముంబై: గ్రేటర్ నోయిడాలో బుద్దా అంతర్జాతీయ స్డేడియంలో ఇటీవల ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ పెద్ద సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇండియాలో ఉన్న బిజినెస్ మెన్స్, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, క్రికెట్ దేవుడు లాంటి ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. దీని తర్వాత ఇండియాలో మరో రేసింగ్ లీగ్ జరుగుతుంది. ఐతే దీనికి...
Read More >>

బెదిరింపులు, ఒత్తిడి వల్లే ఫిక్సింగ్ చేశా: మహ్మద్‌ అమీర్‌

క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట ఫిక్సింగ్. అసలు ఫిక్సింగ్ అంటే ఏమిటి. ఫిక్సింగ్ అంటే డబ్బులు తీసుకొని అవతలి వైపు ఉన్న టీమ్‌ని గెలిపించడం లేదా మనం ఓడిపోవడం. అసలు ఆటగాళ్లు ఫిక్సింగ్ ఎందుకు చేస్తారని అంటే అందుకు చాలానే కారణాలున్నాయి. కొంత మంది డబ్బుకొసం అని మరికొంత మంది మాపై వచ్చిన ఒత్తిడి వల్ల అని కారణాలు చెబుతున్నారు....
Read More >>

గన్‌మెన్‌లను తీసుకోండి : ఇంటలిజెన్స్

గన్‌మెన్‌ల ఉపసంహరణ అంశాన్ని పునరాలోచించుకోవలిసిందిగా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు లేఖ రాశారు. మావోయిస్టు కార్యకలాపాలు తీవ్రమవుతున్న తరుణంలో గన్‌మెన్‌లను వెంట ఉంచుకోవల్సిందిగా అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధులకు విడివిడిగా లేఖలు రాసింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు నిఘా వర్గాలు లేఖ రాశాయి. గన్‌మెన్‌లు లేకుండా తిరగొద్దని ఆయనకు సూచించారు. వెనక్కి పంపించిన...
Read More >>

తెలంగాణ కోసం మరో దీక్ష

తెలంగాణకోసం నిజమాబాద్‌కు చెందిన మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి ఒకరోజు దీక్ష చేపట్టారు. ఆర్మూర్‌లోని జంబి హనుమాన్ దగ్గర దీక్ష ప్రారంభమైయింది. ఈ దీక్షకు పలువురు కాంగ్రేస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, జేఏసీ,ఉద్యోగ సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొని సంఘీబావం తెలిపారు. మరోవైపు మాజీ మంత్రి కోమట్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు...
Read More >>

నటుడికంటే సినిమా గొప్పది Published on November 2, 2011 · No Comments

ఆర్టిస్టుల కంటే సినిమా గొప్పదని నటుడు, దర్శకుడు రవిబాబు అన్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రచారంలో తాను సృజనాత్మకంగా వ్యవహరిస్తానని తెలిపారు. ఈరోజు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నువ్విలా సినిమా యువతను తప్పక ఆకట్టుకుంటందన్నారు. సందేశాలు ఏవీ లేకుండానే రెండు గంటల సేపు హాయిగా నవ్వుకునే విధంగా చిత్రం ఉంటుందన్నారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై...
Read More >>