Saturday, November 5, 2011

కొన్నిగంటల్లో దేవినేని ఉమ అరెస్టు

రచ్చబండలో చేసిన రచ్చపై కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. రెడ్డిగూడెంలో నిన్న జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి పార్థసారధిని అడ్డుకున్న కేసులో ఉమతో పాటు మరో పదిమంది కార్యకర్తలపై పోలీసులు 341,352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  దేవినేని ఉమను అరెస్ట్ చేసేందుకు పోలీసులు శనివారం ఉదయం గొల్లపూడిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. మంత్రి పార్థసారధికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమను అరెస్ట్ చేస్తే రహదారులు దిగ్బంధం చేస్తామని ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ హెచ్చరించారు. పోలీసులు భారీగా మోహరించటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివస్తున్నారు. విజయవాడ నగరంలో కూడా పలు చోట్ల భద్రత ఏర్పాటుచేశారు.

No comments:

Post a Comment

Thank you for your comment