Tuesday, November 1, 2011

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో భారతీయుల మెరుగు


Mahendra Singh Dhoniఇంగ్లాండ్‌ని వైట్ వాష్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇండియన్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బుధవారం ప్రకటించిన ఐసిసి వన్డే ర్యాంకులలో రెండు స్దానాలు పైకి ఎగబాకి, మూడవ స్దానాన్ని కైవసం చేసుకున్నారు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అస్విన్ కూడా ఈ సిరిస్‌లో పది వికెట్లు తీసుకొవడం వల్ల మొట్టమొదటి సారి టాప్ 20లో చోటు దక్కించుకొవడం జరిగింది.

ఇక కొల్‌కత్తా మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇండియా - ఇంగ్లాండ్ సిరిస్‌లో 11వికెట్లు తీసుకొవడంతో 26వ స్దానం నుండి 12వ స్దానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతక ముందు ఆల్ రౌండర్స్‌గా కొనసాగుతున్న బంగ్లాదేశ్ కెప్టెన్ షాకిబ్ ఆల్ హాసాన్, ఆస్ట్రేలియా షేన్ వాట్సన్‌ని వెనుకకు నెట్టడం జరిగింది.

కెప్టెన్ ధోనీ ఈ సిరిస్‌లో 212 పరుగులు చేసి ఆడిన అన్ని మ్యాచ్‌లలోను అజేయంగా నిలవడం జరిగింది. బ్యాటింగ్ విషయానికి వస్తే ఇండియా బ్యాట్స్ మెన్స్ విరాట్ కొహ్లీ ఐదవ స్దానంలో నిలవగా, ఓపెనర్ గౌతమ్ గంభీర్ 13వ స్దానాన్ని కైవసం చేసుకున్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment