Tuesday, November 1, 2011

సర్కారుకు కొనసాగే హక్కు లేదు

అధికారంలో కొనసాగే నైతిక హక్కును ప్రభుత్వం కోల్పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రభుత్వానికి నైతికత ఉంటే రాజీనామా సమర్పించి  ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఎప్పుడూ ఏమి చేయాలో తమకు తెలుసని ఆయన అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నైతికంగా కాక  సాంకేతికంగా కొనసాగుతుందని బాబు అన్నారు.
అవిశ్వాస తీర్మానంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, జగనో, టీఆర్‌ఎస్సో చెబితే అవిశ్వాస తీర్మానం పెట్టే స్థితిలో టీడీపీ లేదని బాబు అన్నారు. రైతు సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీకి మద్దతు తెలపాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment

Thank you for your comment