Friday, November 4, 2011

పొన్నాలకు అమెరికా అవార్డు

మన ఐటీ మంత్రికి అమెరికా పురస్కారం లభించింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ప్రతిష్టాత్మక ఓక్లహామా స్టేట్ యూనివర్శిటీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం లభించింది. లక్ష్మయ్య ఆ యూనివర్శిటీ  స్టూడెంటే. ఆ యూనివర్శిటీ సత్కరించిన జాబితాలో ఈయన తొంభైవారు కావడం విశేషం. లక్ష్మయ్య ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఆ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు. కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. అనంతరం స్వదేశానికి వచ్చి పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించారు.

అధికార పదవులు

  • ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి
  • 2009 – కొంతకాలం క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ మరియు మధ్యతరహా నీటి పారుదల శాఖ మంత్రి
  • 2004-2009 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ మరియు మధ్యతరహా నీటి పారుదల శాఖ మంత్రి
  • 2002 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా పద్దుల సంఘ సభ్యుడు మరియు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సంఘ సభ్యుడు
  • 1999 – జనగాం నియోజకవర్గం నుండి శాసనసభకి ఎన్నిక
  • 1991 మరియు 1992 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సభ్యుడు

No comments:

Post a Comment

Thank you for your comment