Friday, November 4, 2011

బాబు వేశాలు జనం నమ్మరు : బొత్స

అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం పాదయాత్ర చేయటం హాస్యాస్పదంగా ఉందని, ఆయన ఎన్ని వేషాలు వేసినా ప్రజలు విశ్వసించరని  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబునాయుడు తన స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర చేపట్టారని,  వైఎస్ రాజశేఖరరెడ్డిలా పాదయాత్ర చేసి బాబు అధికారంలోకి రావాలనుకోవటం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉందని బొత్స ఎద్దేవా చేశారు.
రైతుల ఆత్మహత్యలకు తానే బాధ్యుడినని చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాకే పాదయాత్ర చేపట్టాలని బొత్స డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో భూకేటాయింపుల విషయంలో మంత్రివర్గం మొత్తం బాధ్యత వహిస్తుందని ఆయన అన్నారు. అయితే తెర వెనక జరిగిన భూ కేటాయింపుల అక్రమాలతో మంత్రులకు సంబంధం లేదని అన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment