Friday, November 4, 2011

అన్నా మౌనదీక్ష విరమణ

అన్నా హజారే మౌన 19 రోజుల మౌనదీక్షను విరమించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఆయన దీక్ష విరమణ జరిగింది. అక్టోబర్ 16 నుంచి పందొమ్మిది రోజులు పాటు అన్నా హజారే మౌనదీక్ష చేపట్టారు. భారత్ మాతాకీ జై అంటూ మౌనం వీడారు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనలోక్ పాల్ బిల్లు అమలయ్యేవరకూ పోరాడతానని స్పష్టం చేశారు. తన మౌనదీక్ష ఎవరికీ వ్యతిరేకం కాదని…అవినీతిని సమూలంగా నిర్మూలించటమే తమ ధ్యేయమని అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని ఉత్తరాఖండ్ లోకాయుక్త బిల్లు మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో తీసుకురావాలన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకుని చట్టాలను చేయాల్సిన అవసరం ఉందని హజారే అన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment