Friday, November 4, 2011

పాపం చిరు అభిమానులు

చిరంజీవి అభిమానులకు శుక్రవారం తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలికేందుకు చిరంజీవి వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు విమానాశ్రయంలోకి అనుమతించలేదు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను ఎంతకూ లోపలకు అనుమతించక పోవడంతో వారు విమానాశ్రయం ముందు ఆందోళనకు దిగారు.

No comments:

Post a Comment

Thank you for your comment