Friday, November 4, 2011

రామలింగరాజుకు బెయిల్

జైలు నుంచి బయటకు రావాలన్న రామలింగరాజు ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, ఆడిటర్ వడ్లమాని శ్రీనివాస్ లకు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరికీ రెండు లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ, ట్రయిల్ కోర్టు విచారణకు సహకరించాలని సూచించింది. రెండున్నరేళ్లకు పైగా రామలింగరాజు జైల్లోనే ఉన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment