Tuesday, November 1, 2011

అలరిస్తున్న ‘తెలంగాణ గోదావరి’

అరుణ, రమితాశెట్టి జంటగా రమేష్‌రెడ్డి తుమ్మల స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తెలంగాణ గోదావరి’ పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే పాటలను విడుదల చేశారు. ఆడియోకు శ్రోతల నుండి మంచి స్పందన వస్తోందని, ముఖ్యంగా తెలంగాణలోని పదిజిల్లాల్లో విశేష స్పందన వచ్చిందని దర్శక, నిర్మాత రమేష్‌రెడ్డి తెలిపారు.
గీత రచయితలు రాచర్ల సురేష్‌, లక్ష్మణ్‌ కోడిచర్ల, పద్మ శ్రీనివాస్‌, రమేష్‌రెడ్డి అందించిన సాహిత్యానికి సంగీత దర్శకుడు యశోకృష్ణ చక్కని బాణీలు సమకూర్చారు. పాటల ఆదరణ వెనుకవారి కృషి ఎంతగానో ఉంది. ఈ పాటల్లో తెలంగాణ బతుకును, వారి వెతలను కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. 1969, 72 మధ్య తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటనల ఇతివృత్తంతో శ్రమకోర్చి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఏడు పాటలు న్నాయి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కూడా పూర్తిచేసి తొలికాపీ సిద్ధం చేశాను అని రమేష్‌రెడ్డి వివరించారు.

No comments:

Post a Comment

Thank you for your comment