Friday, November 4, 2011

వాళ్లది తొందరపాటు : డీఎస్

అతి త్వరలో తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం తొందరపాటు చర్యేనని, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని, అధిష్టానం రాష్ట్రంలోని పరిస్థితుల్ని చక్కదిద్దాలని సీరియస్ గా ఆలోచిస్తోందని త్వరలోనే అనిశ్చితి తొలగిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
డీఎస్ బుధవారం ఉదయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తాను మర్యాదపూర్వకంగానే సోనియాను కలిశానని, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకుని టీఆర్ఎస్ సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. త్యాగం అంటే రాజీనామా చేసి మళ్లీ గెలవటమా అని డీఎస్ ప్రశ్నించారు. తెలంగాణ పట్ల తన  చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment