Friday, November 4, 2011

‘ఈనాడు’కు శంకర్రావు జై

విచిత్రమైన ఆరోపణలు, సరికొత్త వ్యాఖ్యానాలతో నిత్యం వార్తల్లో ఉండే శంకర్రావు గురువారం మళ్లీ మీడియాను ఆకట్టుకున్నారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవటంలో ఈనాడు సంస్థను ఆదర్శంగా తీసుకుని ఇతర సంస్థలు ముందుకు రావాలని ఆయన అందరికీ సూచించారు.
కర్నూలులో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2009 సంవత్సరంలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగటంతో ముంపునకు గురైన బాధితులను ఈనాడు సంస్థ ఆదుకొన్న తీరు అభినందనీయమన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలిలో వరదనీటిలో మగ్గాలు కొట్టుకుపోయి ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు ఈనాడు సంస్థ మరమగ్గాలను అందజేసి వారి జీవనోపాధిని పునరుద్ధరించిందన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment