Tuesday, November 1, 2011

రచ్చబండకు రావద్దు

తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి హాజరు కావద్దని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ కోరారు. నవంబర్ 1వ తేదీన నల్లజెండాలు ఎగురవేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవద్దని ఆయన సోమవారం విలేకర్ల సమావేశంలో అన్నారు. జేఏసీ చేపట్టనున్న నిరవధిక దీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాయిదాపడిన దీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని కోదండరామ్ పేర్కొన్నారు.
నవంబర్ 1ని విద్రోహదినంగా పాటిస్తూ మంత్రులు, ప్రజాప్రతినిధులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని, నిరసనకారులను అడ్డుకుంటే తీవ్రపరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.

No comments:

Post a Comment

Thank you for your comment