
ఈ ఫలితాలపై విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ మాట్లాడుతూ స్థూల ఆర్థిక రంగంలో నెలకొన్న అస్థిరత భయాలే కొంపముంచాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఐటీ వ్యాపారాభివృద్ది ఆరోగ్యకరంగానే ఉందన్నారు. భవిష్యత్తులో తాము పెట్టే పెట్టుబడులు సంస్థ పురోగతికి కారణం కాగలవనే ఆకాంక్షను తెలిపారు. ఇదిలావుంటే రానున్న డిసెంబర్ 31తో ముగిసే మూడవ త్రైమాసికంలో 1,500 మిలియన్ డాలర్ల నుంచి 1,530 మిలియన్ డాలర్ల వరకు ఐటీ సేవల వ్యాపారం నుంచి ఆదాయం రావచ్చని విప్రో అంచనా వేసింది.
మరోవైపు ఈ రెండో త్రైమాసికంలో కొత్తగా సంస్థలోకి 5,240 మందిని తీసుకున్నామని దీంతో సెప్టెంబర్ 30 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,31,730 చేరిందని, అంతేగాక కొత్తగా 44 మంది కస్టమర్లను చేర్చుకున్నట్లు తెలిపింది. కేవలం ఐదుగురు కస్టమర్ల నుంచి 100 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందుకుంటున్నామని విప్రో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సురేష్ సేనాపతి తెలిపారు.
No comments:
Post a Comment
Thank you for your comment