Saturday, November 5, 2011

శబరిమలకు ఆర్టీసీ బస్సులు

ఆర్టీసీ హరిహరపుత్రుడు అయ్యప్ప సేవలో తరిస్తోంది. కేరళలోని శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అంతేకాదు చార్జీల్లో రాయితీ కూడా ఇచ్చింది. ఏడాదికేడాది ఆంధ్రప్రదేశ్ నుంచి తరలివెళ్లే భక్తజనులు పెరగడంతో వారికి సదుపాయాలు కల్పించడానికి ఆర్టీసీ కృషిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భక్తుల డిమాండ్‌కు అనుగుణంగా 1700 బస్సులను నడపాలని నిశ్చయించింది. ఈ బస్సులు నేరుగా శబరిమలకు వెళ్లకుండా భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల మీదుగా ప్రయాణిస్తాయి.  ప్యాకేజీలు వ్యక్తిగత, గ్రూపు విభాగాల్లో దొరుకుతున్నాయి.  బస్సు మొత్తం బుక్ చేస్తే ఇద్దరు వంట మనుషులు, గురుస్వామి ఇద్దరు మణికంఠ (బాలభక్తులు)లకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తారు.
వివరాలకు : 801 999 9999, 040-3366699 నెంబర్లలో సంప్రదించవచ్చు.
ఆర్టీసీ ఆన్ లైన్ బుకింగ్ లింక్ : http://apsrtconline.in/

No comments:

Post a Comment

Thank you for your comment