Tuesday, November 1, 2011

నేను గానీ అధికారంలో గానీ ఉన్నానంటే…

తాను అధికారంలో ఉంటే తెలంగాణ సమస్యను రెండు నిమిషాల్లో పరిష్కరిస్తానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. గుంటూరులో ఆంధ్రజ్యోతి  చానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ వైఖరి వల్లే తెలంగాణ సమస్య జటిలంగా తయారైందని, ఆ పార్టీయే అధికారంలో ఉందని, అందువల్ల వారే సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
తెలంగాణపై తమ అభిప్రాయాన్ని గతంలోనే చెప్పామని, అయితే ఆ తర్వాత రెండు ప్రాంతాల్లోను భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. తమ అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రజాభిప్రాయం మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నో అంశాలపై తాను చేసిన సూచనలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకుందా ? అని ఆయన ప్రశ్నించారు. కేవలం రాజకీయంగా తమను దెబ్బతీసేందుకే కాంగ్రెస్‌ ప్రయత్నిస్త్తోందని, అందుకనే తాము ఈ విషయంలో తమ పార్టీని కాపాడేందుకు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నామన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment