Wednesday, November 2, 2011

శ్రీరామరాజ్యంలో తెలంగాణ

తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల్ని టాలీవుడ్ హీరో బాలకృష్ణ ఉపసంహరించుకోవాలని మెదక్ ఎంపీ విజయశాంతి డిమాండ్ చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోకపోతే త్వరలో విడుదల కానున్న శ్రీరామరాజ్యం చిత్రాన్ని అడ్డుకోవడంపై ఆలోచిస్తామన్నారు. బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం త్వరలో విడుదల కానుంది. మరో వైపు తెలంగాణ ఫిల్మ్ జేఏసీ కూడా  సినీ హీరో బాలకృష్ణ సమైక్యాంధ్రకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో తెలంగాణలో బాలకృష్ణ సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించింది. శ్రీ రామ రాజ్యం నిర్మాతలకు మాత్రం ఈ వివాదం నేపథ్యంలో గుబులు మొదలైంది.

No comments:

Post a Comment

Thank you for your comment