Thursday, November 3, 2011

11/3/2011 Namastheandhra.com | News all the way... ఆమెను చంపింది డైరెక్టరే !

ప్రతి క్షణం సినిమాకు డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన 24 ఏళ్ల సత్య అలియాస్ సత్యవతి కృష్ణా నగరలో హత్యకు గురయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈమెకు కర్నూలు జిల్లాకు చెందిన రాజేంద్రప్రసాద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ ను బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యవతి హత్యకు సంబంధించి అతన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు కృష్ణా నగర్ లోని రాజేంద్రప్రసాద్ ఆఫీసులోనే నివాస ముంటుంది. సంఘటన జరిగిన అనంతరం బాధితురాలిని శ్రీనగర్ కాలనీ లోని తన్వీర్ హాస్పిటల్ కు రాజేంద్రప్రసాదే తీసుకువచ్చారు. అప్పటికే సత్యవతి మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సత్యవతి మెట్ల మీద నుంచి పడిందని తొలుత చెప్పిన రాజేంద్రప్రసాద్ తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేశారు.  సత్యవతి మేడపై ఉన్న వెలి ముద్రలు, రాజేంద్రప్రసాద్ వెలి ముద్రలతో సరిపోవటంతో పోలీసులు రాజేంద్ర ప్రసాద్ ను అనుమానిస్తున్నారు. కాగా, సత్యవతి మెడ చుట్టూ గాయాలు, గోరు గాట్లు ఉన్నాయి.
దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ‘థ్రిల్లర్’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అంతకుముందు ‘ప్రతిక్షణం’ అనే సినిమాకు ఆయన పనిచేసారు. ఇదిలావుంటే, రాజేంద్ర ప్రసాద్ – సత్యవతి ల మధ్య గత మూడేళ్ళుగా వివాహేతర సంబంధం నడుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment