Tuesday, November 1, 2011

20 రోజుల్లో సర్కారు ఖతం

రానున్న 20 రోజుల్లోగా ప్రభుత్వం కూలటం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ సర్కార్ కు సిగ్గు ఉంటే నవంబర్ 21లోగా విశ్వాస పరీక్ష ఎదుర్కొవాలని సవాల్ విసిరారు. ఆరు నెల్లలోగా వైఎస్ జగన్ సీఎం అవుతారన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. కిరణ్, బొత్స, చిరంజీవి, చంద్రబాబులాంటివారు ఎంతమంది కలిసినా జగన్ ను ఏమీ చేయలేరని జూపూడి అన్నారు. ఎమ్మెల్సీగా డీఎస్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని ఆయన అన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment