Wednesday, November 9, 2011

కోమటిరెడ్డి దీక్ష విరమణ

రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం నిరాహారదీక్ష విరమించారు. తెలంగాణ కోసం ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి తల్లి చంద్రమ్మ నిమ్స్‌లో ఆయనతో దీక్ష విరమింపజేశారు. కాంగ్రెస్ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాధం, కేశవరావు, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్‌గౌడ్, విఠల్, దేవీప్రసాద్ దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ కోమటిరెడ్డి తొమ్మిది రోజులు పాటు దీక్ష కొనసాగించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన అంతిమ లక్ష్యం అని దీక్ష విరమించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ ఎంపీలు, పార్టీ పెద్దల సలహాలతోనే దీక్ష విరమించానని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Thank you for your comment