Thursday, November 17, 2011

అనుష్కపై ఐటీ పిడుగు

టాలీవుడ్ టాల్ బ్యూటీకి చిక్కులు వచ్చాయి. ఆస్తులు దాస్తున్నదన్న అనుమానంతో అనుష్క ఇంటిలో బుధవారం ఆదాయపు శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుష్క ఇంట్లోనే ఉండటం గమనార్హం. బంజారా హిల్స్ లోని ఆమె ఇంటి నుంచి కీలక పత్రాలు, బ్యాంకు పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.  కేవలం ఆమె ఐటీ లెక్కలు సరిగా చూపిస్తున్నారో లేదో తెలుసుకోవడం కోసం ఈ తనిఖీలు జరిగాయి, అంతకు మించి ఏం లేదని ఆమె సన్నిహితులు చెప్పారు . అయితే, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అనుష్క అందించిన వివరాల్లో క్లారిటీ లేకపోవడం వల్లే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
అయితే, నాగార్జున చాలా ఆస్తులు అనుష్క పేరిటే దాచినట్టు టాలీవుడ్ లో సీరియస్ టాక్. ఆమె అంటే నాగ్ కు మంచి గురి అని చెబుతారు. గతంలో ఐటీ అధికారుల కళ్లు చెదిరేలా నాగార్జున పన్నులు కట్టిన విషయం తెలిసిందే. అయితే, మరి అనుష్క పేరిట దాచినవి కూడా అతడి ఆస్తులని తెలిస్తే, తేలితే…!!!

No comments:

Post a Comment

Thank you for your comment