Friday, October 28, 2011

డిసెంబరు 9 న ‘పంజా’

పవన్‌కల్యాణ్‌ తాజా చిత్రం ‘పంజా’. సారాజేన్‌, అంజలీ లావానియా హీరోయిన్లు. విష్ణువర్ధన్‌ దర్శకుడు. సంఘమిత్ర ఆర్ట్స్‌, ఆర్కా మీడియా వర్క్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పాట చిత్రీకరణ మినహా పూర్తయింది. నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ మాట్లాడుతూ  ఆసక్తికరంగా నడిచే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కోల్‌కతా నేపథ్యంలో ఉంటుంది. అభిమానులు ఆశించే అన్ని అంశాలతో చిత్రం చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన పవన్‌ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. యువన్‌ శంకర్‌రాజా సంగీతం ఓ హైలైట్‌గా నిలుస్తుంది. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్‌ 13న ఆడియోను, డిసెంబర్‌ 9న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, జాకీష్రాఫ్‌, అతుల్‌ కులకర్ణి, అడవి శేషు, పరుచూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, ఝాన్సీ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, యాక్షన్‌: శామ్‌కౌశల్‌, స్క్రీన్‌ప్లే: రాహుల్‌ కోడా.

No comments:

Post a Comment

Thank you for your comment