Saturday, October 29, 2011

అర్ధరాత్రి సబిత ఇంట్లో సీబీఐ

గాలి సెగ సబితకూ తగిలింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆమె కూడా విచారణను ఎదుర్కొన్నారు.  ప్రస్తుతం హోం మంత్రిగా పనిచేస్తున్న సబితా ఇంద్రారెడ్డి గతంలో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో అప్పటి అక్రమాల గురించి ఆమె విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. శుక్రవారం తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు సీబీఐ ఆమె ఇంట్లోనే ఉంది. సబిత హయాంలో గాలి మైనింగ్ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి సబిత ఆధ్వర్యంలో జరిగిన వ్యవహారాలను సీబీఐ అధికారులు ఆమె నుంచి రాబట్టారు.

No comments:

Post a Comment

Thank you for your comment