Saturday, October 29, 2011

కేసీఆర్ ఓ బ్లాక్ మెయిలర్

తెలంగాణ ఉద్యమాన్ని టెండరు కోసం అమ్మేసిన కేసీఆర్కు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత కూడా లేదని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు.  పోలవరం టెండర్ల కోసం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన దళారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు టి.దేవేందర్‌గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి దుమ్మెత్తిపోశారు. నోటి దురుసుతనంతో కెసిఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. పోలవరం టెండర్ల కేటాయింపులో కేసీఆర్ పాత్రపై తాము విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పకుండా అబద్దాలతో బైటపడాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు.
బ్లాక్‌మెయిల్ కేసీఆర్ కుటుంబానికి బాగా తెలిసిన విద్య అని, ఐటీ ఒకరు, పరిశ్రమలు ఒకరు ఇలా హైదరాబాద్ ను ఆ కుటుంబం పంచుకుని మరీ వసూళ్లు చేస్తోందని వారు ఆరోపించారు. ఆంధ్రా విద్యా సంస్థలను వెళ్లగొడతామని చెప్పి ఆ తర్వాత మౌనంగా ఉండటం, ల్యాంకోహిల్స్‌పై కోర్టులో వేసిన కేసు వెనక్కు తీసుకోవటం వాళ్ల నుంచి డిమాండ్ చేసినంత దక్కడమే కారణం అన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment