Saturday, October 29, 2011

నల్లబజారులో ఎరువులు : జగన్

రాష్ట్రంలో ఎరువులు నల్లబజారులో కొనుక్కోవలసిన దుస్థితి దాపురించిందని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తున్న జగన్ శుక్రవారం సాయంత్రం చుండూరు మండలంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వైఎస్  రాష్ట్ర ప్రజల గుండె లోతుల్లో కొలువై ఉన్నారని  అన్నారు. వ్యవసాయం చేయడానికి రైతన్న భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు.

No comments:

Post a Comment

Thank you for your comment