Sunday, October 30, 2011

మా ఊళ్ళో కాంగ్రెస్ పరిస్థితి బాలేదు !

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని స్వయంగా ఆ పార్టీ నేతే వ్యాఖ్యానించారు. ఆయనెవరో కాదు కేంద్ర హోంశాఖ మంత్రి పి చిదంబరం.  ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 749 మంది ఎన్నికైనప్పటికి, పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శివగంగ నియోజకవర్గంలో 61 మంది విజయం సాధించారని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ ఐదు శాతం ఓట్లను సాధించి, ఐదవ స్థానంలో నిలిచింది.

No comments:

Post a Comment

Thank you for your comment