Sunday, October 30, 2011

సొంతింట్లో దొంగతనం !

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వాళ్లని చూస్తుంటాం. కానీ ఈ దొంగ సొంతింటి వాసాలే లెక్కెట్టేశాడు. విజయవాడలోని ఓ వ్యాపారి పుత్రుడు చేసిన ఘన కార్యమిది. విజయవాడ సీతారాంపురంలో నివసించే వ్యాపారి లక్ష్మినారాయణ ఇంట్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఆయన వ్యాపారానికి సంబంధించిన నగదును స్కూటర్‌ డిక్కీలో పెట్టేవారు. అది ఇంటి ఆవరణలోనే వాహనాన్ని పార్క్‌ చేసినపుడే పోయేది. గత కొంత కాలంగా వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో దొంగలు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వారిని చూసి పోలీసులకు, బాధితులకు ఇద్దరికీ షాక్ తగిలింది. కారణం.. దొంగ ఎవరో కాదు వ్యాపారి పుత్ర రత్నమే. తన స్నేహితులతో కలసి చోరీలకు పాల్పడేవాడు. నిందితుల నుంచి ఐదున్నర లక్షలనగదు, బంగారు నగలు ఖరీదైన సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్త నగరంలో హల్ చల్ చేసింది.

No comments:

Post a Comment

Thank you for your comment