
శుక్రవారం ప్రాక్టీస్ రేసు జరుగనుంది. శనివారం క్వాలిఫయింగ్ రేసులను నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం ప్రధాన రేసు జరుగనుంది. రేసుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యంత అధునాతనమైన ట్రాక్ను రూపొందించారు. జేపీ గ్రూప్ చైర్మన్ మనోజ్ గౌర్, భారత మోటార్ స్పోర్ట్స్ క్లబ్ సమాఖ్య అధ్యక్షుడు విక్కీ చందోక్, భారత తొలి ఫార్ములావన్ డ్రైవర్ నారాయణ్ కార్తీకేయన్ల పర్యవేక్షణలో అధునాతన ట్రాక్ను ఏర్పాటు చేశారు. భారత్లో జరిగే తొలి ఎఫ్-1 పోటీల కోసం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను వెచ్చించారు.
ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఫార్ములావన్ బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తిన మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ షారూక్ఖాన్, సహారా ఫోర్స్ ఇండియా యజమాని విజయ్మాల్యాలతో సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే నోయిడా చేరుకున్నారు. స్టార్ బాక్సర్ విజేందర్ కూడా ఎఫ్-1 ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. భారత క్రీడారంగంలో ఇప్పటివరకు క్రికెట్కే ఆదరణ ఉండేది..దాన్ని వెనక్కి నెట్టెలా ఖరీదైన ఫార్ములావన్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. హామిల్టన్, షూమకర్, వెటెల్, సుటిల్ తదితర స్టార్ డ్రైవర్లు తమ అద్భుత విన్యాసాలతో అభిమానులను అలరించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇండియాలో మొట్టమొదటి సారి ప్రారంభిస్తున్న ఈ ఫార్ములా వన్ రేసులు దేశ చరిత్రలోనే హాట్టహాసంగా మిగిలిపోయే విధంగా నిర్విహించనున్నామని నిర్వాహాకులు తెలియజేశారు.
No comments:
Post a Comment
Thank you for your comment