
ఈ మహాసభలకు వివిధ దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరవుతారని
చెప్పారు. సాంస్కృతిక ప్రదర్శనల కోసం రాష్ట్ర ప్రభుత్వం కళాబృందాలను
పంపేందుకు అంగీకరించిందని తెలిపారు. ఆయా అంశాలపై మాట్లాడేందుకు పరిశోధకులను
పంపాలని తెలుగు విశ్వవిద్యాలయాన్ని కోరామన్నారు. ప్రారంభోత్సవానికి
ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని వివరించారు.
బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, సభల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు సొంత
ఖర్చులతో రావాల్సి ఉంటుందని, అక్కడ స్థానికంగా ప్రయాణ ఖర్చులు, భోజనం
ఏర్పాట్లను ట్రస్టు చూస్తుందని తెలిపారు.
No comments:
Post a Comment
Thank you for your comment